Home » Nellore politics
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడం, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని.. విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. మహానాడు నిర్వహణకు పలుచోట్ల స్థలాలను చూశామని పేర్కొన్నారు.
ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నాయపాళెంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నెల్లూరు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన ఉదయం11 గంటలకి ఎన్నిక నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..