Home » Kotamreddy Sridhar Reddy
నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నెల్లూరు రూరల్లో ‘నన్ను ప్రశ్నించండి’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధి దైవాంశ సంభూతుడు కాదని.. ఓటేసి గెలిపించిన ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని చెప్పుకొచ్చారు.
నెల్లూరు రూరల్లో రూ.17 కోట్లతో చేపట్టే 168 అభివృద్ధి పనులకు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్లో రూ.700 కోట్లతో అభివృద్ధి చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీలో అతిసామాన్యులకు ఉన్నత పార్టీ పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇష్టంగా కష్టం చేస్తే కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు.
రాష్ట్రంలో మనుగడ లేదన్న నిరాశ, నిస్పృహలోకి జగన్ వెళ్లారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తుకు రాలేదా అని జగన్ను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తమిళనాడులోని సీఎంసీ వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్న ఆయనకు గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరులో రూ.613 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.