Home » Kotamreddy Sridhar Reddy
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
నెల్లూరు: పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నెల్లూరు: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ నేతలు ఉచ్చానీచ్చాలు మరచి, బరితెగించి వ్యవహారిస్తున్నారని, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, సోషల్ మీడియా వేదికగా ఎక్కువైయ్యాయని మండిపడ్డారు.
ల్లూరు జిల్లా: జగన్ ప్రభుత్వం అరాచకాలు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతూ ఉండటంతో సర్కార్ టీడీపీ నేతలను టార్గెట్ చేసింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై అక్రమ కేసు బనాయించింది.
మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.
నెల్లూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు.
నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు.
ఆటో డ్రైవర్లు, యజమానులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపరీతంగా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ స్పీకర్ ముందుకు వ్యక్తిగతంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యక్తిగతంగా స్పీకర్కు వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణను ఆనం రానారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ నెల 5న సమర్పించారు.