Nellore: 60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్లకు వివరించిన కోటంరెడ్డి
ABN , Publish Date - May 06 , 2025 | 08:51 AM
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూ. 41 కోట్లతో చేపట్టిన 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు వివరించారు. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులను చేపట్టామని చెప్పారు.

నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులకు (Rs. 41 crore development projects) సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy).. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రి లోకేష్ (Minister Lokesh)కు వివరించారు. నిన్న (సోమవారం) ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా మే 15వ తేదీన (May 15th) ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు.
Also Read: అమరావతిపై కుట్ర.. ప్రభుత్వం సీరియస్..
మంత్రి లోకేశ్తో ఎమ్మోల్యే కోటంరెడ్డి
సీఎం చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి.. ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు. వాటికి సంబంధించిన బుక్లెట్ను అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిని, ఆయన బృందాన్ని మంత్రి లోకేష్ అభినందించారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 41 కోట్లతో 339 అభివృద్ధి పనులు కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడం రికార్డు’ అని పేర్కొన్నారు. కోటంరెడ్డి కృషి అందరికీ ఆదర్శమని కొనియాడారు.
15న 339 పనులకు ప్రారంభోత్సవాలు...
కాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్లతో 339 అభివృద్ధి పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులను చేపట్టామని చెప్పారు. ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ 339 పనులకు ప్రారంభోత్సవాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి పార్టీల నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ప్రధాన పనులను మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ప్రారంభిస్తారని కోటంరెడ్డి తెలిపారు.
దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకే రోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ప్రత్యేకంగా ఓ బుక్లెట్ని రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.231 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. కొండాయపాలెం, భక్తవత్సల నగర్లలోని రైల్వేగేట్ అండర్ బ్రిడ్జిల పనులని త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఊహించని విషాదం.. పెళ్లికి ఒకరోజు ముందు..
For More AP News and Telugu News