Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి
ABN , Publish Date - May 10 , 2025 | 05:32 AM
గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం బర్త్ వెయిటింగ్ హాల్స్, యువత కోసం స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు

గర్భిణీలకు బర్త్ వెయిటింగ్ హాల్స్: సంధ్యారాణి
అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని 9 ఐటీడీఏల పీఓలు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో విజయవాడ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఐసీడీఎస్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తామన్నారు. అరకు కాఫీని ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. గర్భిణీలకు ఉపయోగపడే విధంగా బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు.