Share News

CM Revanth: యాదాద్రిలో ఘనంగా బ్రహోత్సవాలు.. సీఎం రేవంత్‌ దంపతుల ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:27 AM

Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.

CM Revanth: యాదాద్రిలో ఘనంగా బ్రహోత్సవాలు.. సీఎం రేవంత్‌ దంపతుల ప్రత్యేక పూజలు

యాదాద్రి, మార్చి 11: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం సమర్పించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar reddy) ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

Mudragada Padmanabham: వైసీపీలో చేరేందుకు ముద్రగడకు ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..

TSRTC: చెప్పుకోండి చూద్దామంటూ సజ్జనార్ వెరైటీ క్వశ్చన్.. ఆన్సర్ ఇచ్చేయండి మరి


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 11 , 2024 | 01:54 PM