Share News

Mudragada Padmanabham: వైసీపీలో చేరేందుకు ముద్రగడకు ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:19 AM

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. వైసీపీ లో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్‌ను ‌ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నట్లు వెల్లడించారు.

Mudragada Padmanabham: వైసీపీలో చేరేందుకు ముద్రగడకు ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే..

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీ (YSRCP)లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. వైసీపీ లో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్‌ (CM Jagan)ను ‌ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి బయలు దేరుతున్న తనతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. తనతో వచ్చేవారు కావలసిన ఆహారం, ఇతర అవసరాలు వారి వాహనంలోనే తెచ్చుకోవాలని ముద్రగడ లేఖలో పిలుపునిచ్చారు.

AP Politics: ఎంపీ మాగుంట శ్రీనివాసులును కలిసిన టీడీపీ నేతలు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 11:19 AM