Home » konda surekha
వనస్థలిపురంలోని హరినవనస్థలి పార్క్లోని అనాణ్య రిసార్ట్ను తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండ సురేఖ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో రిసార్ట్ మెయింటనెన్స్పై అసహనం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
పోచారం వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా వెళ్తున్న మెదక్-ఎల్లారెడ్డి రహదారి విస్తరణను వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు ఆమోదించింది.
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరిచామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తమపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లలో మాటలతో బీఆర్ఎస్ గడిపిందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన అక్కినేని కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారని సీనియర్ న్యాయవాది అశోక్రెడ్డి వాదించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
కొందరు హీరోయిన్లు హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. రకుల్ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని చెప్పారు. కొంతమంది హీరోయిన్ల ప్రయివేట్ సంభాషణను రికార్డు చేసి..
Telangana: అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు. దీంతో మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.