Share News

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..

ABN , Publish Date - May 07 , 2024 | 07:21 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది.

Lok Sabha Polls: మూడో విడత ప్రారంభం.. బీజేపీ, కాంగ్రెస్‌లను వెంటాడుతున్న భయం..
Congress and BJP

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతలకు గానూ మూడో విడత పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. 12 రాష్ట్రాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్‌లను భయం వెంటాడుతోంది. మూడో దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో 2014, 2019లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ విడతలో ఎక్కవ స్థానాలు గెలవాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు పెద్దగా నష్టం జరిగే అవకాశం లేకపోయినా.. అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి సైతం ఈ విడతలో సగానికి పైగా సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. 2019లో వచ్చిన ఫలితాలను తిరిగి సాధించడం ప్రస్తుతం బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. వాస్తవానికి 93 లోక్‌సభ స్థానాలకు గానూ 42 స్థానాల్లో బీజేపీ బలంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో విడతలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!


మొత్తం 1331 మంది..

మూడో విడతలో 93లోక్‌సభ స్థానాలకుగానూ 1331 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ 82 లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తుండగా 11 స్థానాల్లో ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు పోటీచేస్తున్నాయి. కాంగ్రెస్‌ 68 స్థానాల్లో పోటీచేస్తుండగా.. మిగతా చోట్ల ఇండియా కూటమిలో పార్టీలు పోటీచేస్తున్నాయి. బీఎస్పీ 79 స్థానాల్లో, ఎస్పీ 9 నియోజకవర్గాల్లో, శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ4, ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన 4చోట్ల పోటీచేస్తోంది.


గత ఎన్నికల్లో..

మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న 93 నియోజకవర్గాల్లో 2019ఎన్నికల్లో బీజేపీ 87 స్థానాల్లో పోటీ చేసి 72 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో పాటు ఎస్పీ 2, శివసేన 4, ఎన్సీపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు.


ఎవరి గ్రాఫ్ ఎంత..

మూడో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో బీజేపీ పొలిటికల్ గ్రాఫ్ గత పదేళ్లుగా పెరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభావం తగ్గుతున్న స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న 93 స్థానాలకుగానూ 2009 ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలుచుకోగా, నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014లో ఆ సంఖ్య 67కు పెరిగింది. 2019లో మరో ఐదు సీట్లు పెరిగి 72 సీట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ గెలిచిన సీట్లు 2009లో 27, 2014లో 9, 2019లో కేవలం 4 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. 2009 నుంచి లెక్కలు చూస్తే కాంగ్రస్ సీట్లు తగ్గగా.. బీజేపీ సీట్లు మాత్రం పెరుగుతూ వస్తున్నాయి.


ఈనేపథ్యంలో కాంగ్రెస్‌కు మూడో దశ సవాలుగా మారింది. ముఖ్యంగా 93 స్థానాలకు గానూ 47 లోక్‌సభ స్థానాలు బలమైనవిగా పరిగణించబడుతున్నాయి, వీటిలో గత మూడు ఎన్నికల్లో ఒకే పార్టీ విజయం సాధించింది. 42 స్థానాల్లో బీజేపీ వరుసగా మూడు ఎన్నికల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌కు ఒక సీటు, ఇతర పార్టీలకు నాలుగు సీట్లు వచ్చాయి.


ఎన్నికలు ఏయే రాష్ట్రాల్లో..

మూడో దశలో అస్సాంలో 4, బీహార్‌‌లో 5, ఛత్తీస్‌గఢ్‌‌లో 7, మధ్యప్రదేశ్‌‌లో 9, మహారాష్ట్రలో 11, దాదర్‌ నగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూలో ఒక్కో స్థానం. గోవాలో ఒకటి, కర్ణాటకలో 14, పశ్చిమ బెంగాల్‌లో 4, గుజరాత్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి కంటే కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.


బీజేపీకి బలమైన కోటగా

మూడో దశలో 26 పార్లమెంట్ స్థానాలున్న గుజరాత్‌లోని 25 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 2014, 2019లో బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధించింది. దీంతో గుజరాత్ బీజేపీకి బలమైన కోటగా ఉంది. ఈసారి బీజేపీ సంఖ్యను తగ్గించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని 7 స్థానాలకు గాను 6 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కర్ణాటకలో మూడోదశలో ఎన్నికలు జరగుతున్న 14 స్థానాల్లోనూ గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. యూపీలో ఎన్నికలు జరుగుతున్న 10 స్థానాలకు గాను బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. ఈదశలో బీజేపీని కాంగ్రెస్ ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తిగా మారింది. మూడో దశలో ఎన్నికలు జరుగుతున్న 93 స్థానాల్లో ఎవరు కింగ్ అనేది జూన్4న తేలనుంది.


PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 08:26 AM