Home » Lok Sabha Elections
హిమాచల్ప్రదేశ్ హైకోర్టు బుధవారం.. మండి బీజేపీ లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్(Kangana Ranaut)కు నోటీసులు జారీ చేసింది. లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని, దీని వెనక కంగనా ఉన్నట్లు కిన్నౌర్ నివాసి లాయక్ రామ్ నేగి ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ.. తన విచారణను ముగించింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గాయన్నదానిపై నిజనిర్ధారణ కోసం పార్టీ జాతీయ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ.. బుధవారంరాత్రి హైదరాబాద్కు చేరుకుంది.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.
ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్.. జులై 5వ తేదీ అంటే శుక్రవారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగు రోజుల పెరోల్పై ఆయన బయటకు రానున్నారని సమాచారం. ఆ క్రమంలో లోక్సభ సభ్యుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారని తెలుస్తుంది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్సభలో సోమవారం చేసిన ప్రసంగం తీవ్ర దుమారానికి కారణమైంది. కేంద్రప్రభుత్వంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
లోక్సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్.. ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్లు తెలుగులో ప్రమాణం చేశారు.
ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్లో లోక్సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Post) ఎవరిని వరిస్తుందనే చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లే. స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గర ఉంచుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రస్తుత సార్వత్రక ఎన్నికల ఓటింగ్లో మహిళలు మున్నెన్నడూ లేని విధంగా పాల్గొన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. మహిళా కేంద్రిత సంక్షేమ పథకాల గురించి బీజేపీ ఎంతగా ప్రచారం చేసినప్పటికీ మహిళా ఓటర్ల మద్దతును పొందడంలో బీజేపీ వెనుకబడే ఉన్నది.