Share News

Anitha: అప్పుడొకలా... ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహారం దారుణం

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:35 PM

Andhrapradesh: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు - పవన్‌లు నిలబడ్డారని అన్నారు.

Anitha: అప్పుడొకలా... ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహారం దారుణం

విశాఖపట్నం, మార్చి 8: ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabhahm) వైసీపీలోకి (YSRCP) వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (TDP Leader Vangalapudi Anitha) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు (TDP Chief Chandrababu) - పవన్‌లు నిలబడ్డారని అన్నారు. గతంలో రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ సూచన చేశారని.. మరిప్పుడు కాపులకు జగన్ (CM Jagan) రాజ్యాధికారం ఇస్తానన్నారా.. ముద్రగడ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడొకలా ఇప్పుడొకలా ముద్రగడ వ్యవహరించడం దారుణమన్నారు. ముద్రగడ వైసీపీ కోవర్ట్ అని కాపులకు తెలిసిందన్నారు. పోలీసులు - పరాధాలు లేకుండా బయటికి రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి కాలికి బలపం కట్టుకుని తిరుగుతుందని.. ముందు ఆమెకు సమాధానం చెప్పాలి జగన్ అని వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి....

GVMC: సీఎం సభకు రాకపోతే ఇలా చేస్తారా?.. జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం

Womens Day: రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ అభినందనలు



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 02:36 PM