Home » VANGALAPUDI ANITHA
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ ముఠా ఎంతకైనా దిగజారుతోందని హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. మూగ జీవాలను బలి తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ పార్టీ ఉన్మాదాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని అనిత అన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు మంత్రి. విశాఖను ఐటీ హబ్గా మార్చుతున్న సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి లోకేష్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమని మంత్రి అనిత అన్నారు. పవర్ లిఫ్టింగ్తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు.
మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం వెళ్లాలనే డ్రెస్ కోడ్ పాటిస్తున్నామని మంత్రి అనిత చెప్పారు. అందరు గాయత్రీ దేవి అలంకారానికి అనుగుణంగా రెడీ శారీస్తో వచ్చినట్లు తెలిపారు.
Anitha On Terror Links: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం చేసిన ఆధారాలు లేవని హోంమంత్రి అనిత విమర్శించారు. గంజాయి పండించే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కలిగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.
Anitha Criticizes Jagan: జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు హోంమంత్రి అనిత. జగన్కు ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువే ఇస్తున్నామని.. జగన్ మాట్లాడే పద్దతి సరైనదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vangalapudi Anitha: గంజాయి సాగు అనేది 90 శాతం వరకు తగ్గిపోయిందని మండలిలో హోంమంత్రి అనిత తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసిన, అమ్మిన, దానిని ప్రేరేపించిన, దానిని ఉపయోగించిన గంజాయి విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు.