Home » Vangalapudi Anitha
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ని కుదించుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని హోం మంత్రి అనిత తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.
సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్లో మంత్రుల బృందం పర్యటించనుంది.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హోంమంత్రి అనిత హెచ్చరించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ను అధికారులందరూ అనుసరించాలని ఆదేశించారు.
ఏపీ పోలీస్ టీ20 క్రికెట్ టోర్నీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోలీసులు ఇప్పటికే ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లో ముందుంటారని చెప్పారు. ఈ టోర్నీతో పోలీసుల ప్రైడ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న రోగం ఏంటో గూగుల్ కూడా చెప్పలేకపోతోందని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్ ఒరిజినల్ హ్యాబిట్యుయల్ క్రిమినల్ అని అన్నారు.
మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రులు ప్రశంసించారు.
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రైనేజీ, ఇరిగేషన్, భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.