Share News

GVMC: సీఎం సభకు రాకపోతే ఇలా చేస్తారా?.. జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:10 PM

Andhrapradesh: విశాఖలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని 92 మంది సచివాలయ సిబ్బందికి జోనల్ కమిషనర్ ఆర్‌జీవి కృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల రుషికొండ సమీపంలో రాడిషన్ బ్లూ హోటల్‌లో జరిగిన "విజన్ వైజాగ్" సీఎం కార్యక్రమానికి రానివారికి, ఆలస్యంగా వచ్చిన సచివాలయ సిబ్బందికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

GVMC: సీఎం సభకు రాకపోతే ఇలా చేస్తారా?.. జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం

విశాఖపట్నం, మార్చి 8: విశాఖలో(Visakhapatnam) జీవీఎంసీ అధికారులు (GVMC Officials) అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని 92 మంది సచివాలయ సిబ్బందికి (secretariat staff) జోనల్ కమిషనర్ ఆర్‌జీవి కృష్ణ (Zonal Commissioner RGV Krishna) షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల రుషికొండ సమీపంలో రాడిషన్ బ్లూ హోటల్‌లో జరిగిన "విజన్ వైజాగ్" సీఎం కార్యక్రమానికి రానివారికి, ఆలస్యంగా వచ్చిన సచివాలయ సిబ్బందికే షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ పథకాల విషయంలో సచివాలయ సిబ్బంది సర్వే విషయంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతోనే షాకాజ్ నోటీసులు ఇచ్చినట్టు జీవీఎంసీ అధికారులు కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 21న జోనల్ కమిషనర్‌కు విధుల నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని జీవీఎంసీ అధికారులు కోరారు. సచివాలయ సిబ్బంది వివరణ ఇవ్వకపోతే... మార్చి జీతం నిలిపివేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని నోటీసులు ద్వారా బెదిరింపులకు దిగారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ తీరుపై కలెక్టర్ ఫిర్యాదు చేసే యోచనలో సచివాలయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి...

Tulasi Reddy: జగన్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి: తులసి రెడ్డి

Womens Day: రాజ్యసభకు సుధామూర్తి.. మోదీ అభినందనలు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 02:11 PM