Share News

ఆ రెండు పార్టీలకి ఓటేస్తే.. తెలంగాణ మరో బంగ్లాదేశ్: రాజాసింగ్

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:33 PM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఎంఐఎంకు ఓటు వేసినా తెలంగాణ మరో బంగ్లాదేశ్ అవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని చూసి.. బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు..

ఆ రెండు పార్టీలకి ఓటేస్తే.. తెలంగాణ మరో బంగ్లాదేశ్: రాజాసింగ్
Raja Singh

హైదరాబాద్, ఫిబ్రవరి 9, (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సెటైర్లు గుప్పించారు. ఓవైసీకి రేవంత్‌రెడ్డి దాసోహం అంటున్నారని విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసదుద్దీన్ , అక్బరుద్దీన్‌లకు రేవంత్‌రెడ్డి సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. ఎంఐఎంకు ఓటు వేసినా తెలంగాణ మరో బంగ్లాదేశ్ అవుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని చూసి బీజేపీకి ఓటేయాలని రాజాసింగ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 09 , 2026 | 03:05 PM