Home » Municipal elections
పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. అలాగే ఓట్లకోసం ప్రధాన పార్టీ నేతలు పడరానిపాట్లు పడుతుండగా... కొంతమంది వ్యక్తులు మాత్రం తమ నిజాయతీని చాటుకుంటున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని ఓ వ్యక్తి ఇక్కడ ఓట్లు అమ్మబడవు.. అంటూ ఫ్లెక్సీ కట్టారు. వివరాలిలా ఉన్నాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, బీఫామ్ల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీఫారం అందించేందుకు మంగళవారం వరకు గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సిద్దమైంది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీకి సిద్దమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మధ్య మున్సిపాలిటీల్లో మాత్రం పొత్తులు పొసగలేదు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితి, ఎన్నికల అధికారుల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో.. ప్రధాన పార్టీలకు నామినేషన్ల ఉపసంహరణ పరీక్షగా మారిందని చెప్పవచ్చు. కాంగెస్ పార్టీ నుంచి ఈ పోటీ తీవ్రంగా ఉండగా బీఆర్ఎస్ నుంచి కూడా అదేస్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది.