Home » MIM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
బీజేపీ, ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు బిహార్ అసెంబ్లీకి ఈఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి మహా కూటమి(మహా ఘట్బంధన్) నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ గురి పెట్టింది. త్వరలో జరగబోయే ఉప ఎన్నిక కావడంతో అధికార పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీఆర్ఎస్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రత్యేక దృష్టి సారించింది.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. కౌంటింగ్ పూర్తి అయింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాలని అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి, భద్రతా వైఫల్యాలు కూడా ఉన్నాయని అఖిలపక్షం అంగీకరించింది