Home » MIM
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్ హరిశంకర్ జైన్ రాష్ట్రపతిని కోరారు.
గత లోక్సభలో ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(మజ్లి్స్) పార్టీకి ఇద్దరు సభ్యులుండగా ఈసారి ఒకే ఒక్క సభ్యుడితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న మజ్లిస్ మొట్టమొదటిసారి 1984 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టింది.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న మైనార్టీలు హైదరాబాద్(Hyderabad) లోక్సభ స్థానం పరిధిలో వార్ వన్సైడ్ చేశారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో అత్యధికంగా ఉన్న మైనార్టీలు ఒకటి, రెండు శాతం మినహా పూర్తిగా మజ్లిస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
హైదరాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.
తెలంగాణలోని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయా!? ఫలితాల్లోనూ ఆ రెండూ ఢీకొంటున్నాయా!? రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోనుందా!? ఈ ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ‘ఔను’ అనే అంటున్నాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు
హైదరాబాద్(hyderabad) లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత(madhavi latha) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు(police) కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లోక్సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.