Home » MIM
కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..
కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
అత్యధిక పన్ను కడుతున్న హిందువుల సొమ్మును ముస్లింలకు దోచి పెడుతున్నారని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని.. తోక లేదని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి అప్పుడు కాళేశ్వరం.. ఇప్పుడు మూసీని తెరమీదకు తెచ్చారని దెప్పిపొడిచారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో తరుచూ వాడీ వేడీ చర్చలు జరుగుతుంటాయి. సభ్యుల మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరి ఆందోళన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు దసరా పండగ ఖర్చు భారీగానే అవుతోంది. మద్యం, మామూళ్లు ఇవ్వాలంటూ చోట, మోటా నేతలు ఆశావహుల ఇళ్ల వద్ద క్యూ కట్టారు. కొందరూ ఆశావహులు రెండు రోజులుగా పంపకాలను ప్రారంభించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
నాంపల్లి రెడ్డి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ తరపున కార్పొరేటర్గా పోటీ చేసిన ఆయేషా ఫర్హీన్ ఈరోజు(ఆదివారం) రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదల చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.