Home » Raja Singh
హైదరాబాద్ నగరంలోని జిమ్లలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు విజ్ఞప్తి చేశారు.
గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని అన్నారు.
జై శ్రీ రామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా అని మంత్రి కొండా సురేఖ ఎలా అంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఎండోమెంట్ మంత్రి అంటే దేవుడికి మినిస్టర్లాగా ఉండాలని.. కానీ కొండా సురేఖ ఏశాఖకు మంత్రి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ‘పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
హిందు పండుగలు, ముస్లింల పండుగల మధ్య తెలంగాణ ప్రభుత్వం తేడాలు ఎందుకు చూపిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసేలా చూడాలని కోరారు.
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.