Home » Raja Singh
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27వ తేదీలోగా ఆయనను చంపేస్తామని ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలోకి వెళ్లడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ‘పాత ఇళ్లు, పాత ఫ్రెండ్స్.. ఎప్పుడైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
హిందు పండుగలు, ముస్లింల పండుగల మధ్య తెలంగాణ ప్రభుత్వం తేడాలు ఎందుకు చూపిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసేలా చూడాలని కోరారు.
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ముస్లింలు శ్రీశైలం పవిత్ర స్థలంలో తలపాగాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ, ఇది మా అబ్బ పార్టీ. మేం చెప్పిందే జరిగి తీరుతుంది.. మేం రాసిందే రాజ్యమవుతుంది..
గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
తాను మళ్లీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని, అమిత్ షా తనకు ఫోన్ చేశారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.