హైదరాబాద్లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
ABN , Publish Date - May 06 , 2026 | 09:54 AM
హైదరాబాద్లోని చారిత్రక కట్టడం చార్మినార్ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్పై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని చారిత్రక కట్టడం చార్మినార్ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్పై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆమెపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించింది.
చార్మినార్ సందర్శనకు వచ్చిన నటి..
పశ్చిమ బెంగాల్కు చెందిన నటి ప్రత్యూష పాల్ ఈ నెల 2వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వచ్చారు. తన పర్యటనలో భాగంగా సాయంత్రం సమయంలో చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేస్తూ ఫుట్పాత్ వద్ద వస్తువులు చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసభ్య ప్రవర్తన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌక్కు చెందిన అబ్దుల్ వాజీద్ (40) అనే వ్యక్తి నటి ప్రత్యూష పాల్ను గమనించి ఆమె వెంటపడడం ప్రారంభించాడు. 2వ తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో ఆమెను అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నటి కుటుంబ సభ్యులతో ఉన్నప్పటికీ నిందితుడు వేధింపులకు పాల్పడినట్లు సమాచారం.
చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు..
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన నటి ప్రత్యూష పాల్ వెంటనే చార్మినార్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్
పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News