మహిళా ఎస్ఐపై దాడి కేసు.. వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:40 PM
శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్చార్జి చింతాడ రవికుమార్ను ఏపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస వైసీపీ ఇన్చార్జి చింతాడ రవికుమార్ను ఏపీ పోలీసులు ఈరోజు (శనివారం) అరెస్ట్ చేశారు. చిలకపాలెం వద్ద రవిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఎస్ఐపై దాడి కేసులో అతను ఏ-1గా ఉన్నారు. పది రోజులుగా పోలీసులు కళ్లుగప్పి రవి తిరుగుతున్నాడు. గత నెల 30వ తేదీన మాజీమంత్రి అప్పలరాజు ములాఖత్ కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా భారీగా కార్యకర్తలతో జగన్కు స్వాగతం పాలకటానికి చింతాడ రవి వచ్చాడు.
కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐపై దురుసుగా ప్రవర్తించటంతో పాటు అసభ్యంగా రవి, అతని అనుచరులు వ్యవహరించారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే చింతాడ రవితో పాటు 28 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రవి కోసం విస్తృతంగా టాస్క్ఫోర్స్ పోలీసులు గాలించారు. ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు కూడా చదవండి...
జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News