Share News

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:52 AM

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి
Eluru District Tiger Attack

ఏలూరు జిల్లా , జులై 30 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన పెద్దపులి రెండు ఆవులపై దాడి చేయడంతో అవి మృతిచెందాయి. ఈ ఘటనతో గ్రామస్థులు భయపడ్డారు. పశువులపై జరిగిన ఈ దాడి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.


మంగపతి దేవి పేట ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది గ్రామ ప్రజలకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయట తిరగవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాత్రి సమయంలో పొలాలు, అటవీ ప్రాంతాల వైపు వెళ్లకూడదని తెలిపారు.


పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పశువులను రాత్రి సమయాల్లో బయట ఉంచకుండా సురక్షిత ప్రాంతాల్లో కట్టివేయాలని చెప్పారు. పెద్దపులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థులు పెద్దపులిని చూస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 10:05 AM