Home » Leopard
చిత్తూరు నగరం రెవెన్యూ గుంట హౌసింగ్ కాలనీవాసులకు చిరుత భయం వెన్నాడుతోంది.
రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్లోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.
శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి ఘాట్ రోడ్డులో భక్తులు వెళ్తుండగా చిరుతపులి తారసపడింది. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని సూరంపేట, గంగారాంతండా అటవీ శివారులో రెండు ఆవులపై పెద్దపులి దాడిచేసి చంపగా ఆవుల కళేబరాలను గురువారం కొడిమ్యాల డీఎఫ్ఆర్వో ముషీర్ అహ్మద్, బీట్అధికారులు దహనం చేశారు.
కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయందోళనలు సృష్టిస్తున్న ఈ పులి ప్రస్తుతం శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం.
కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని కొండలు, పొలాల ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలియడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.
మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయలుదేరిన మగ పులి.. వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారం శివారుకు చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..