Malla Reddy: మల్లారెడ్డి సంచలనం.. రాజకీయాలకు గుడ్బై..!
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:30 PM
రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని... తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని... తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి.
తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
Read latest Telangana News And Telugu News