Home » Mallareddy
మైసమ్మ గూడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
Hyderabad: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్..
మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా బాలానగర్లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ (ఆఫ్ క్యాంప్స)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్ర ఉన్నతవిద్యామండలికి ఆదేశాలు జారీచేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై మేడ్చల్ కోర్టుకు బుధవారం రెవెన్యూ శాఖ అధికారులు నివేదిక అందజేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో గత రెండు రోజులుగా మల్లారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University)లో విద్యార్థులు మరోసారి ఆందోళన (Students Protest)కు దిగారు. అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ యూనివర్శిటీ ఎదుట బైఠాయించి "మల్లారెడ్డి డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యుత్తమ ప్రమాణాలతో తమ యూనివర్సిటీ విద్యను అందిస్తోందని మల్లారెడ్డి సంస్థల చైర్మన్ చామకూర మల్లారెడ్డి (Mallareddy) పేర్కొన్నారు. అమెరికా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది.
మేడ్చల్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ (FTL)లో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి.
‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.