Yamini Sharma Fires On Jagan: జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు.. యామిని శర్మ ఫైర్
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:46 PM
ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని యామిని శర్మ మండిపడ్డారు.
విజయవాడ, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ (Yamini Sharma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారని.. ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్కి ఐదేళ్లు అధికారం ఇస్తే... ఏమి చేయలేక.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ (శుక్రవారం) విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు యామిని శర్మ.
పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తే జగన్ అండ్కో కు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కోర్టు జగన్కి మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం జగన్కి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. నిన్న మెడికల్ కాలేజీ మొండి గోడలు చూడటానికే జగన్ వెళ్లారని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు యామిని శర్మ.
పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేస్తుంటే.. జగన్ చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఏపీ అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే ఇంకా బెడ్స్ పెరుగుతాయని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఎక్కువగా అందుతాయని వివరించారు. ఐదేళ్ల జగన్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News And Telugu News