Home » AP BJP
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీస్ హబ్ ప్రారంభించడం మనందరికీ గర్వకారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఇవాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జరిగిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గ్రామాల్లో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సూచించారు. తాజాగా ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేస్తామని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలోనూ రైతులను, సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోవచ్చని వివరించారు.
హంద్రీనీవా ప్రాజెక్టు కెనాల్ పూర్తి చేసి.. కుప్పం వరకు నీళ్లు అందిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. త్వరలోనే పురుషోత్తపట్నం పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయని.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
భాగ్యనగరంలోని నానక్రామ్గూడలో ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులతో ప్రత్యేకంగా సంతలు, రైతు బజార్లు ఏర్పాటు చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. కేంద్రం అమలు చేసే పథకాల గురించి అందరూ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.