Share News

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jul 24 , 2026 | 09:15 AM

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Jangaon Road Accident

జనగామ జిల్లా, జులై 24 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


మృతులను నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్

విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్

రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 09:35 AM