Home » Jangaon
జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పెద్దపులి సంచారంతో జనగామ జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రేమ, స్నేహం పేరుతో యువతి (18)ని నమ్మించి పలువురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన మహమ్మద్ ఒవైసీ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకున్నాడు.
Google Maps Wrong Direction: మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. ఇందు కోసం వారు గూగుల్ సహాయం తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కారు జనగామ వద్దకు రాగానే గూగుల్ మ్యాప్ తప్పు దారి చూపించింది.
గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.
జనగామలోని కుర్మవాడకు చెందిన బాలుడు పర్శ సాయి కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్లో పోస్టు పెట్టారు.
మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి.
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.