Home » Jangaon
జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.
రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఉన్న బాలుడిని మొదట నాగుపాము కాటేసింది. తర్వాత కొద్ది నిమిషాలకే మరో విష సర్పం రక్తపింజరి కాటు వేసినట్లు తెలుస్తోంది.
జనగామలో ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.
కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే అతి దారుణంగా ప్రాణాలు తీస్తున్న రోజులివి. జనగామ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది..
కన్న కొడుకులను బిస్కెట్లో విషం కలిపి చంపాలని తండ్రి సుపారీ ఇవ్వడం కలకలం రేపింది. జనగామ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.
జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పెద్దపులి సంచారంతో జనగామ జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.