కామారెడ్డి జిల్లాలో దారుణం.. భర్తను చంపేసిన భార్య
ABN , Publish Date - Apr 26 , 2026 | 08:25 AM
కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలనీలో భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది.
కామారెడ్డి జిల్లా, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు గోసంగి కాలనీలో భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన ప్రజలను షాక్కు గురిచేసింది. ఈ ఘటనలో భార్య కోదండం లక్ష్మి.. భర్త శివాజీపై కొడవలితో దాడికి దిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
దంపతుల మధ్య వాగ్వాదం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలైన కోదండం లక్ష్మి, శివాజీ మధ్య కొంతకాలంగా కుటుంబ సమస్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తరచుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి తలెత్తిన వాగ్వాదం పెద్ద గొడవగా మారి చివరకు హత్యకు దారితీసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కోదండం లక్ష్మి కోపోద్రిక్తంగా మారి, ఇంట్లో ఉన్న కొడవలితో భర్త శివాజీపై దాడి చేసింది. ముఖ్యంగా మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదండం లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ప్రాథమికంగా ఇది కుటుంబ గొడవల కారణంగా జరిగిన హత్యగా భావిస్తున్నప్పటికీ.. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. చైర్మన్గా సీఎస్ రామకృష్ణరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News