Share News

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 09 , 2026 | 08:58 PM

నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు.

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం రేవంత్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఈ యాగం నిర్వహించనున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం బయలుదేరనున్నారు.


రేపు 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో జరిగే యాగం వద్దకు రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. యాగం ముగిసిన అనంతరం 4 గంటలకు హైదరాబాద్‌కు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో విజయ్ విహార్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో వ‌రుణ‌యాగం జరిపిస్తారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించనున్నారు.


వార్తలు కూడా చదవండి...

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్‌

సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 09:59 PM