Share News

మళ్లీ మూడు నెలల రేషన్‌..

ABN , Publish Date - Jul 31 , 2026 | 09:42 AM

ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

మళ్లీ మూడు నెలల రేషన్‌..
Ration distribution

  • వచ్చే నెల 31 వరకు ఈ-కేవైసీ

హైదరాబాద్‌ సిటీ: ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. జిల్లాలోని 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 7,279.513 మెట్రిక్‌ టన్నుల గోధుమలు కేటాయించిందని, బియ్యం ఉచితంగా, గోధుమలను కిలోకు రూ.7 చొప్పున పంపిణీ చేస్తున్నదని చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ రాజిరెడ్డి ఒక ప్రకటనలో సూచించారు.


city4.2.jpgఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు సరుకులు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని రేషన్‌ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు వరకు పొడిగించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 09:42 AM