నేడు చర్లపల్లి-దానాపూర్ మార్గంలో వన్వే ప్రత్యేక రైలు
ABN , Publish Date - May 27 , 2026 | 07:22 AM
వేసవి దృష్ట్యా చర్లపల్లి- దానాపూర్ మార్గంలో వన్వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: వేసవి దృష్ట్యా చర్లపల్లి- దానాపూర్ మార్గంలో వన్వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు చర్లపల్లి నుంచి 07089 ప్రత్యేకరైలు బయలుదేరి గురువారం రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటుందని పేర్కొంది. ఖాజీపేట్, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బలార్ష, చందాఫోర్ట్, గోండియా, బాలఘాట్, నైన్పూర్, కాట్ని, సత్నా, మానిక్పూర్, ప్రయాగ్రాజ్, చౌకి, దీన్దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగుతుందని సీపీఆర్ఓ శ్రీధర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News