Share News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం

ABN , Publish Date - Aug 17 , 2026 | 08:21 AM

హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేగు మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
Hyderabad Software Employee Case

హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ శ్రీ సాయిరామ్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేగు మహేశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్.. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మహేశ్ కుటుంబ సభ్యులు సొంతూరుకు వెళ్లారు. దీంతో మహేశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, చెల్లిని మిస్ అవుతున్నానంటూ తన చెల్లికి మెసేజ్ పంపించాడు.


ఆ మెసేజ్‌పై అనుమానం వచ్చిన చెల్లి.. సమీప బంధువు గిరిబాబుకు సమాచారం అందించి ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. గిరిబాబు మహేశ్ ఇంటికి వెళ్లి పరిశీలించగా.. పడక గదిలో ఉరివేసుకున్న స్థితిలో మహేశ్ కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహేశ్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.


వార్తలు కూడా చదవండి...

బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా?: సీఎం రేవంత్‌

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 08:29 AM