Share News

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

ABN , Publish Date - Jun 11 , 2026 | 07:08 AM

కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌ 10న ప్రారంభించారు.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు
Kacheguda Railway

  • 1916 జూన్‌ 10న ప్రారంభం

  • నిర్మాణంలో ప్రత్యేకత.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు

హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌ 10న ప్రారంభించారు. నిజాం రాష్ట్ర రైల్వేకు ఈ స్టేషన్‌ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఎంతో చరిత్ర గల ఈ స్టేషన్‌ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. చుట్టూ మీనార్ల మధ్యలో డోములతో గోతిక్‌ ఆర్కిటెక్చర్‌ శైలిలో స్టేషన్‌ను నిర్మించారు. రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాలు నిర్మించినా చారిత్రక కట్టడాలకు నష్టం కలగకుండా దక్షిణ మధ్య రైల్వేప్రత్యేక చర్యలు తీసుకుంది.


city1.2.jpgఈ రైల్వే స్టేషన్‌కు గ్రీనరీ ప్లాటినం, సోలార్‌ విద్యుత్‌, ఇందన పొదుపు, ఐజీబీసీ పర్యావరణ అవార్డులు లభించాయి. ఈ రైల్వే స్టేషన్‌ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిరోజూ రూ.60 లక్షల ఆదాయం వస్తుంది. నిత్యం 50 వేల మంది ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్‌ గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఐదు ప్లాట్‌ ఫారాలు ఉన్నాయి. సోలార్‌ విద్యుత్‌ ద్వారా కరెంట్‌ను ఆదా చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 07:08 AM