కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు
ABN , Publish Date - Aug 27 , 2026 | 08:11 AM
హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతీరోజు బయల్దేరే కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పులేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. శ్రీధర్ తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతీరోజు బయల్దేరే కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ సమయంలో ఎలాంటి మార్పులేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. శ్రీధర్ తెలిపారు. ప్రతీరోజు రాత్రి 7.5 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.55 గంటలకు మైసూరులోని అశోకాపురం చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం లో మధ్యాహ్నం 2.55 గంటలకు అశోకాపురం రైల్వే స్టేషన్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News