విద్యార్థులకు ఊరట.. ఫీజువసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:51 PM
ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వచ్చే జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని పేర్కొంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-9లోని నాలుగు నిబంధనల అమలుపై తాత్కాలికంగా స్టే విధించింది. హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు జులై 6వ తేదీ జరిగే తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.
దీంతో సంబంధిత విద్యాసంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితికి తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది. ఫీజు రీయింబర్స్మెంట్ విధానానికి సంబంధించిన వివిధ అంశాలపై పిటిషనర్లు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జులై 6వ తేదీ జరగనున్న తదుపరి విచారణలో ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను పరిశీలించనుంది. అనంతరం హైకోర్టు మరిన్ని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసు తీర్పు రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు, విద్యాసంస్థలపై ప్రభావం చూపే అవకాశముండటంతో ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక: మంత్రి పొన్నం ప్రభాకర్
డూప్లికేట్ ఓట్లతోనే రేవంత్రెడ్డి గెలిచారని మా అనుమానం: కవిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News