Home » Telangana High Court
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెంచి సరిహద్దులు మార్చుతున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నేటితో (డిసెంబర్ 17)తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో వర్జీనియాలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ శ్రీదేవి తన ప్రేరణాత్మక జీవిత కథను సభికులతో పంచుకున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఓపెన్ అయినట్లు సమాచారం.
హైదరాబాద్లో అధ్యాపక సభని శనివారం నిర్వహించాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో FATHI లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు.
మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు తీర్పు కీలక తీర్పు ఇచ్చింది. ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సర్వే నెంబర్ 194, 195 భూదాన్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి అన్యాక్రాంతం చేశారంటూ పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టు వాదించారు.
ఈ సమయంలో ఎలాంటి డైరెక్షన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది హైకోర్టు.