Home » Telangana High Court
Telangana: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న (బుధవారం) జవహర్నగర్లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యేల పిటిషన్లపై ఈరోజు హైకోర్టు విచారణ చేస్తుంది.
Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్ను వేశారు.
దేవాలయాలను వాణిజ్య దృక్కోణంలో నిర్వహించదరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని ఆలయాల నిర్వాహకులు, అధికారులు ఖర్చు ల పేరు చెప్పి ఆదాయమే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టింది. ఆలయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత అని, కానీ వ్యయాలను రాబట్టుకోవాలనే పేరుతో వాటిని వాణిజ్య సంస్థల్లా తయారు చేస్తున్నారని ఆక్షేపించింది.
బక్రీద్ పండగ (Bakrid festival) సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు(Telangana High Court) ఆదేశించింది. ఈ మేరకు గోవులను తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)కి హైకోర్టు(High Court)లో ఊరట లభించింది. ఆయనతోపాటు కుటుంబ సభ్యులనూ అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీవన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మొకీల, చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును(CBI Court) ఆశ్రయించారు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.