ఎన్నికల్లో పోటీ చేయండి
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:13 PM
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
అన్నామలైకి వానతి వినతి
చెన్నై: శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ జిల్లా సింగానల్లూర్ నుంచి పోటీచేస్తారని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ, బీజేపీకి కేటాయించిన సీట్లలో సింగానల్లూర్ లేదు.
దీంతో మనస్తాపం చెందిన అన్నామలై, తాను ఎన్నికల్లో పోటీచేయడం లేదని పార్టీకి లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయమై ఆ పార్టీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ. ఎన్నికల్లో అన్నామలై పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని తన అభిప్రాయమని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News