Home » AIADMK
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.
అంబుమణి రామదాస్తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు.
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో.. మళ్లీ ‘అమ్మ’పాలన రావాలని పలువురు నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థమైపోయిందన్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.