టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే
ABN , Publish Date - May 19 , 2026 | 05:44 PM
తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నిర్వహించనున్న టీజీ పీజీఈసెట్ (TG PGECET - 2026) పరీక్ష షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మే 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. పరీక్ష తేదీ మార్పుతో అభ్యర్థులు అయోమయానికి గురికాకుండా అధికారిక షెడ్యూల్ను పరిశీలించాలని సూచించారు. మే 28వ తేదీకి బదులుగా జూన్ 1వ తేదీన పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇతర తేదీల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు మాత్రం ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రం, సమయం, సూచనలు వంటి వివరాలను హాల్ టికెట్లో జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. పరీక్షకు కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఈ-గవర్నెన్స్పై ప్రశంసలు.. ప్రజలకు సులభ సేవలపై కేంద్రం దృష్టి
భద్రతా దళాల సమన్వయంతో నక్సలిజంపై విజయం సాధించాం: అమిత్ షా
రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం.. బాధితులకు భారీగా టోకరా
Read Latest Telangana News And AP News And International News And Telugu News