తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:47 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు.
బుధవారం హుండీ ఆదాయం: రూ.4.50 కోట్లు
గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 75,428
తలనీలాలు సమర్పించినవారు: 42,566
ఈ వార్తలు కూడా చదవండి:
సురేశ్ కుటుంబానికి పూర్తి సహకారం
సూపర్ సిక్స్... అట్టర్ ఫ్లాప్
Read Latest AP News And Telangana News And International News And Telugu News