సురేశ్ కుటుంబానికి పూర్తి సహకారం
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:17 AM
ఒమన్ వద్ద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మృతిచెందిన విశాఖపట్నం మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ కుటుంబానికి..
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
విశాఖపట్నం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఒమన్ వద్ద అమెరికా జరిపిన క్షిపణి దాడిలో మృతిచెందిన విశాఖపట్నం మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు శుక్రవారం అధికారులను ఆదేశించారు. సురేశ్ మృతదేహాన్ని విశాఖ తెచ్చేందుకు భారత రాయబార కార్యాలయం, ఒమన్ అధికారులతో మాట్లాడాలని, ఏపీ భవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి అండగానిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు.