Share News

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 02 , 2026 | 08:04 AM

ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
Eluru Fire Accident,

ఏలూరు జిల్లా, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూరిళ్లలో ఒక్కసారిగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిడపటంతో ఇళ్లలో ఉన్న ఇద్దరు మహిళలు బయటకు రాలేక మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మృతుల వివరాలు, అగ్నిప్రమాదానికి కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్‌రావు

బెట్టింగ్ రాకెట్‌పై సీఐడీ ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 08:08 AM