Share News

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. 120 ఏళ్ల నిషేధిత జాబితాలోని భూముల సమస్యకు పరిష్కారం

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:36 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అంబాజీపేట మండలం మాచవరంలో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కలిశారు.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. 120 ఏళ్ల నిషేధిత జాబితాలోని భూముల సమస్యకు పరిష్కారం
AP CM Chandrababu Naidu

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. అంబాజీపేట మండలం మాచవరంలో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కలిశారు. ఈ క్రమంలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మాచవరంలోని గ్రౌండ్ రెంట్ స్థలాలను 1908 సెక్షన్ 22ఏ1 జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.


గ్రౌండ్ రెంట్ సైట్స్‌గా 22ఏ1 నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములకు విముక్తి కల్పించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అప్పగించారు. మాచవరంలోని జయంతి నగర్‌‌లో లబ్ధిదారుల నివాసాలకు వెళ్లి వారితో సీఎం మాట్లాడారు. 120 ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఈ భూములకు విముక్తి కల్పించి పత్రాలు ఇస్తున్నట్లు వివరించారు. గ్రౌండ్ రెంట్ స్థలాలను గ్రామ కంఠం భూములతో సమానంగా పరిగణించి 22ఏ1 నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 06:38 PM