Share News

ఏపీకి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి రానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఐజీ ఆస్పత్రికి మంత్రి లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.

ఏపీకి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రి రానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏఐజీ ఆస్పత్రికి ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) రేపు (సోమవారం) శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచస్థాయి హెల్త్‌కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్ ఏర్పాటు చేయనుంది.


రూ.2వేల కోట్ల పెట్టుబడితో 9వేల మందికి ఉద్యోగాలను ఏఐజీ హాస్పిటల్స్‌ కల్పించనుంది. విశాఖలో 9 ఎకరాల్లో ఈ ఆస్పత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాలను ఏఐజీ హాస్పిటల్స్‌ ఏర్పాటు చేయనుంది. 50కు పైగా వైద్య ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనుంది. వైద్యరంగంలో ఏఐజీ హాస్పిటల్స్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.


ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 03:51 PM