వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:59 AM
వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
కర్నూలు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని (YSRCP MLA Virupakshi) కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిన్న (శనివారం) రాత్రి చిప్పగిరి మండలం కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేసి, కారు ఇంట్లోని వస్తువులను ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులు ధ్వంసం చేశాడు.
తన అనుచరుడి ఫోన్ చేయగానే రాత్రి నేమకల్లుకు ఎమ్మెల్యే తన వాహనాల్లో భారీగా అనుచరులను తీసుకెళ్లి హల్చల్ చేశాడు. ఎమ్మెల్యే విరుపాక్షి నేమకల్ వెళ్లాక మరింతగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వీరి దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నేమకల్లులో పోలీసులు భారీగా మోహరించారు.
వార్తలు కూడా చదవండి...
భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారు: సీఎం చంద్రబాబు
నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News