Share News

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాం వెనుక భారీ కుట్రలు.. యనమల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:36 PM

జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్‌కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..

Yanamala Ramakrishnudu: జగన్ బెంగళూరు మకాం వెనుక భారీ కుట్రలు.. యనమల సంచలన వ్యాఖ్యలు
Yanamala Ramakrishnudu

అమరావతి, జనవరి10(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బెంగళూరు మకాంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుట్రల అమలుకు బెంగళూరులో బ్యాక్ ఆఫీస్ పెట్టారంటూ ఆరోపణలు చేశారు. అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెస్‌ను కేంద్రంగా చేసుకున్నారంటూ ఆక్షేపించారు. బెంగళూరులోనే జగన్ మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. ఇవాళ(శనివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడారు.


అవినీతి సంపద అక్కడే..

తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు తరలించారని యనమల రామకృష్ణుడు అన్నారు. బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని.. సొంత నియోజకవర్గం కానే కాదని చెప్పుకొచ్చారు. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదని.. కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదని.. అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో ఎందుకు మకాం వేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు.


జగన్ ఆస్తులు అమాంతం పెరిగాయి..

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం వల్లే జగన్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఏడీఆర్ తాజా రిపోర్ట్ ప్రకారం జగన్‌తో సహా వివిధ వైసీపీ కీలక నేతల ఆస్తులు ఉన్నట్టుండి 600 శాతం మేర ఎలా పెరిగాయని నిలదీశారు. అవినీతి కారణంగానే ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని విమర్శించారు. జగన్, వైసీపీ నేతలు నియో రిచ్ క్లబ్ నుంచి వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్‌లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో పోగేసిన అవినీతి సంపాదనతోనే జగన్‌తో సహా వైసీపీ కీలక నేతల ఆస్తులు 600 శాతం మేర పెరిగాయన్నారు. బడుగులను అణగదొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటివి జగన్ అవినీతి పుత్రికలేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 01:51 PM