Home » Yanamala RamaKrishnudu
రాష్ట్రంలో నేర రాజకీయాలకు వైఎస్ జగన్, ఆయన అనుచరులే కారణమని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..
జగన్ తన అవినీతి సంపదను బెంగళూరు ప్యాలెస్కు తరలించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు..
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పుట్టినరోజును ఆ పార్టీ శ్రేణులు వేడుకగా జరుపుకోడాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అత్యంత స్వార్థపరుడు, అత్యంత క్రూరమైన రాజకీయనేతగా జగన్ నిలిచిపోతాడని యనమల తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ భారం సామాన్య ప్రజలపై పడుతోందని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంఘం డిమాండ్లను వైసీపీ పూర్తిగా విస్మరించిందని యనమల వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల గురించి వారితో ఎప్పుడూ చర్చలు జరపలేదని మండిపడ్డారు.
జీఎస్టీ తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.
Yanamala On Jagan: జగన్ కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలకు పాల్పడ్డారని యనమల మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం ఆయన తల్లి, చెల్లికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Yanamala: రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు.