Home » Yanamala RamaKrishnudu
Andhrapradesh: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల.. జగన్కు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
Andhrapradesh: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు.
రాజకీయాల్లో సేవకు విలువ లేకుండా పోయింది...డబ్బుల ప్రభావం పెరిగి పోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో సభా విధానాలు, కార్యక్రమాలను నిర్వీర్యం చేసి నవ్వులు పూయించారని, ప్రజా ప్రయోజనాల కోసం తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించారని, పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి సభా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
Andhraradesh: దేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయి ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి (Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు.
సమాజంలో మార్పు కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala RamaKrishnudu) పేర్కొన్నారు. ఆ తీర్పుకు అనుగుణంగానే కేబినెట్ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.
Andhrapradesh: పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు.