పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:37 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ఆత్మకూరు అటవీ శాఖ డివిజన్లో ఓ వ్యక్తి వద్ద పులి గోర్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
నంద్యాల జిల్లా, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆదేశాలతో పులుల మరణాలపై అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో ఆత్మకూరు అటవీ శాఖ డివిజన్లో ఓ వ్యక్తి వద్ద పులి గోర్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్యంగా ఫారెస్ట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పులుల మరణాలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వార్తలు కూడా చదవండి...
అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు
జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News