Share News

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Aug 05 , 2026 | 02:11 PM

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. రూ.3.50 నుంచి రూ.4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ రంగం నుంచి రూ.5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.


బేసిటీ ప్రాజెక్ట్ యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖపట్నం రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సూక్ష్మస్థాయి ప్రణాళిక ద్వారా విశాఖపట్నం రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం చేశారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీలపై దృష్టి సారించాలని అన్నారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకూ వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచించారు.


వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని సూచించారు. అవసరమైన మేరకు వీజీఎఫ్ స్కీంను అమలు చేయాలని తెలిపారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఆర్ధిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


వార్తలు కూడా చదవండి...

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 02:38 PM