సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:50 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి చెన్నైలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ రిసార్ట్లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
ఆగస్టు 20వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' (Southern Zonal Council) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News