Home » Chennai
దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విజయ్ వేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
దివంగత సీఎం జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి..
చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్గురి ఎక్స్ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు భువనేశ్వర్ నుంచి కోల్కతా వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ డెలివరీ బాయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన తెలివితో ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. తన కారణంగా ఆమె ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
సెప్టెంబర్లో కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత తొలిసారిగా టీవీకే అధినేత విజయ్ పుదుచ్చెరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ఓ వ్యక్తి గన్తో రావడంతో తీవ్ర కలకలం రేగింది.
ప్రముఖ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ 300కు పైగా చిత్రాలను నిర్మించారు.
తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.