Home » Chennai
ప్రముఖ నిర్మాత ఏవీఎమ్ శరవణన్(85) కన్నుమూశారు. ఇవాళ(గురువారం) ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. శరవణన్ 300కు పైగా చిత్రాలను నిర్మించారు.
తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
చెన్నైలో నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ ట్రైనర్ విమానం అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సెస్ నా-172 అనే ట్రైనర్ ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ తిరుచ్చి-పుదుక్కోటై జాతీయ రహదారిపై ల్యాండ్ చేశాడు.
తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.
టీవీకే అధ్యక్షుడు విజయ్ అక్టోబర్ 27న కరూర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
తేనాంపేట పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 27వ తేదీ ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు మొదటి మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్తో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
తన వయసు పిల్లలకు పూర్తిగా భిన్నం. అంతరిక్ష రహస్యాలను శోధిస్తోంది. పోస్ట్ డాక్టోరల్ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇండియాలో అతి పిన్న వయసు అనలాగ్ ఆస్ట్రోనాట్గా గుర్తింపు పొందింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.
మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది.
విజయ్ నివాసంలో గురువారం ఉదయం బాంబు పేలబోతోందని పోలీసు కంట్రోల్ రూమ్కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ నేపథ్యంలో, బాంబు స్క్వాడ్ నిపుణులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.